పార్టీ కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి వీరు చలపతిరావు... ఎమ్మెల్యే ప్రసన్న...
కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఆధ్వర్యంలో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేతుల మీదుగా కొత్తగా మంజూరైన పెన్షన్లను పంపిణీ చేశారు. ముందుగా మనబడినాడు నేడు పథకంలో భాగంగా రెండు గదులను ప్రారంభించారు అదే పాఠశాలలో వీరి సుబ్రహ్మణ్యం కుమారుడు వీరి చలపతిరావు 4 లక్షల రూపాయల విరాళంతో డిజిటల్ ల్యాబ్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రసన్న మాట్లాడుతూ వీరి సుబ్రహ్మణ్యం నార్త్ రాజుపాలెం 20 సంవత్సరాల సర్పంచిగా పరిపాలించాలని కొనియాడారు. కొడవలూరు మండలానికి 229 కొత్త పెన్షన్ మంజూరు చేసామని వాటిని ఈరోజు పంపిణీ చేశామని, రాజుపాలెం అభివృద్ధి కొరకు నిరంతరం కృషి చేస్తానని , అదేవిధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ కొరకు ఎంపీ మిథున్ రెడ్డి నిధుల నుంచి పదిలక్షలు గ్రాంట్ సాంక్షన్ అయిందని, టపా తోపు నందు మినరల్ వాటర్ ప్లాంట్ కొరకు ఎమ్మెల్యే నిధుల నుంచి 7 లక్షలు సాంక్షన్ చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా నార్త్ రాజుపాలెం ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ గంధం వెంకట శేషయ్య మరియు వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు